జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ శనివారం నాడు తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు. ముందుగా రాజమండ్రి విమానాశ్రయానికి చేరుకున్న ఆయన అక్కడి నుంచి తుని నియోజకవర్గంలోని తొండంగి మండలం కొత్తపాకల చేరుకొని దివిస్ లాబొరేటరీస్ లాబొరేటరీస్ పరిశ్రమ నిర్మాణ ప్రాంత బాధితులను ఆయన పరామర్శిస్తారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు కొత్తపాకల గ్రామంలో జరిగే బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ పాల్గొననున్నారు.
ముందుగా పవన్ కళ్యాణ్ తూర్పుగోదావరి జిల్లా పర్యటనపై శుక్రవారం రాత్రి వరకు తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఆయన పర్యటనకు అనుమతులు లేవని జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మీ ప్రకటించారు. పోలీసులు అనుమతి నిరాకరించినా పర్యటన ఆగబోదని జనసేన పార్టీ స్పష్టం చేసింది. ఇదే విషయాన్ని పవన్ కళ్యాణ్ కూడా ట్విటర్లో ప్రకటించారు. దీంతో జిల్లావ్యాప్తంగా పోలీసు శాఖ అప్రమత్తమైంది. జిల్లా అంతటా 144 సెక్షన్ అమల్లో ఉన్నట్టు ప్రకటించింది. అనంతరం పవన్ కళ్యాణ్ పర్యటనకు అనుమతి మంజూరు చేస్తున్నట్లు పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైౖర్మన్ నాదెండ్ల మనోహర్కు ఎస్పీ ఫోన్ చేసి తెలిపారు. దీంతో పవన్ కళ్యాణ్ పర్యటనకు అడ్డంకులు తొలిగిపోయాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ