ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి శనివారం నాడు ఈడీ కోర్టు సమన్లు జారీ చేసింది. ఈ నెల 11న విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. అరబిందో, హెటిరో భూ కేటాయింపుల కేసు చార్జిషీట్ ఇటీవలే నాంపల్లి కోర్టు నుంచి ఈడీ కోర్టుకు బదిలీ అయింది. ఈ చార్జిషీట్ను విచారణకు స్వీకరించిన ఈడీ కోర్టు సీఎం వైఎస్ జగన్ సహా వైస్సార్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి, హెటిరో డైరెక్టర్ శ్రీనివాస రెడ్డి, అరబిందో ఎండీ నిత్యానంద రెడ్డి, పీవీ రాంప్రసాద్ రెడ్డి, ట్రైడెంట్ లైఫ్ సైన్సెస్ డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డి, విశ్రాంత ఐఏఎస్ బీపీ ఆచార్యకు ఈడీ కోర్టు సమన్లు జారీ చేసింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ