జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశాన్ని ఆగస్టు 22వ తేదీన నిర్వహించాలని పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. ఈ మేరకు జనసేన పార్టీ ఒక ప్రకటన విడుదల చేసింది. మంగళగిరిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆగస్టు 22, సోమవారం ఉదయం 11 గంటలకు ఈ సమావేశం ప్రారంభమవుతుందని తెలిపారు. పవన్ కళ్యాణ్ అధ్యక్షత వహించే ఈ సమావేశంలో జనసేన పార్టీ చేపట్టిన జనవాణి, కౌలు రైతు భరోసా యాత్ర, రోడ్ల దుస్థితిపై చేపట్టిన డిజిటల్ ప్రచారంపై సమీక్షించనున్నారు.
రాష్ట్రంలో భారీ వర్షాలు, గోదావరి వరదలు కారణంగా నష్టపోయిన రైతాంగం, పరిహారం అందజేయడంలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యంపై కూడా చర్చించనున్నట్టు తెలిపారు. అలాగే రాబోయే మూడు నెలల కాలంలో పార్టీ పరంగా చేపట్టబోయే కార్యక్రమాలు, అక్టోబర్ 5న ప్రారంభం కానున్న పవన్ కళ్యాణ్ రాష్ట్ర పర్యటన విధివిధానాల రూపకల్పనపై సమగ్ర చర్చ ఉంటుందన్నారు. ఈ సమావేశంలో జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ తోపాటు పీఏసీ సభ్యులు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, జిల్లా అధ్యకులు పాల్గొంటారని తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY