జనసేన పార్టీ చేపడుతున్న కౌలు రైతు భరోసా యాత్రలో భాగంగా ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ డిసెంబర్ 18, ఆదివారం నాడు పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో పర్యటించనున్నారు. సత్తెనపల్లిలో సాగు నష్టాలు, అప్పుల బాధలతో కుంగిపోయి బలవన్మరణాలకు పాల్పడిన కౌలు రైతుల కుటుంబాలను పవన్ కళ్యాణ్ పరామర్శించి ఒక్కో కుటుంబానికి రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం అందజేయనున్నారు.
జనసేన పొలిటికల్ అఫైర్స్ (పీఏసీ) చైర్మన్ నాదెండ్ల మనోహర్ మీడియాతో మాట్లాడుతూ, “6 జిల్లాల్లో కౌలు రైతు భరోసా యాత్ర పూర్తయిన తర్వాత, ఈసారి కౌలు రైతు భరోసా సభ సత్తెనపల్లిలో నిర్వహిస్తున్నాం. సత్తెనపల్లిలో ఈ నెల 18వ తేదీన మధ్యాహ్నం 1 గంటకు జరిగే సభకు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ హాజరయి, ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు రూ.లక్ష ఆర్థిక సహాయం, జనసేన పార్టీ నుంచి ఒక భరోసా అందించనున్నారు” అని తెలిపారు. ఈ సభ సందర్భంగా రైతు కుటుంబాల ఇబ్బందులను పవన్ కళ్యాణ్ అడిగి తెలుసుకుని, అనంతరం ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన నాయకులు, జనసైనికులు, వీరమహిళలు పాల్గొననున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE