తెలుగు శాస్త్రవేత్తలు రచించిన ‘గ్లింప్స్ ఆఫ్ సాయిల్ సైన్స్’ అనే పుస్తకాన్ని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ బుధవారం నాడు హైదరాబాద్ లో ఆవిష్కరించారు. భూసార శాస్త్రంపై విశేష అనుభవం ఉన్న పి.హెచ్.డి గ్రహీత శాస్త్రవేత్తలు ఈటెల సత్యనారాయణ, సంతోష్ కుమార్ మంచాల, జురుకుంట్ల భార్గవిలతో కలిసి ఉత్తర భారత శాస్త్రవేత్తలు హనుమాన్ సింగ్ హితవ్, నిధి లూత్రా, జకనూర్ బి. అయివల్లి ఈ పుస్తకాన్ని రచించారు. రైతులకు, పర్యావరణానికి ఎంతో ఉపయుక్తంగా ఉండే ఈ గ్రంథాన్ని రచయితలు పవన్ కళ్యాణ్ కు అంకితం ఇచ్చారు. ఈ పుస్తకావిష్కరణ అనంతరం పవన్ కళ్యాణ్ శాస్త్రవేత్తలతో ముచ్చటిస్తూ, వారి సేవలు మన రాష్ట్రానికి, దేశానికి ఎంతో అవసరమని కొనియాడారు. జనసేన పక్షాన ‘గ్రీన్ పాలసీ’ రూపొందించాలని సంకల్పించామని, దీనిలో పాలుపంచుకోవల్సిందిగా రచయితలను కోరారు, అందుకు వారు సుముఖత వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ సంతకం చేసిన ప్రతులను రచయితలకు అందజేశారు. ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో తెలుగు రచయితలతోపాటు జనసేన కోశాధికారి ఎ.వి.రత్నం, జర్నలిస్టు విఠల్ పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY