జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ శుక్రవారం నాడు జనసేన పార్టీకి ముగ్గురు ప్రధాన అధికార ప్రతినిధులు, మరో ఐదుగురు అధికార ప్రతినిధులను నియమించారు. ప్రధాన అధికార ప్రతినిధులుగా మాజీ ఎమ్మెల్సీ కందుల దుర్గేష్, సీనియర్ రాజకీయ నాయకులు బొలిశెట్టి సత్య, ప్రభుత్వంలో ఉన్నతాధికారిగా పనిచేసి జనసేన పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్న టి. శివశంకర్ లను నియమించారు. స్పీకర్ ప్యానెల్ ప్రతినిధులుగా పోతిన వెంకట మహేష్, మనుక్రాంత్ రెడ్డి, అక్కల రామ్మోహన్ రావు (గాంధీ), పి.గౌతమ్ కుమార్, కూనంపూడి శ్రీనివాస్ లను ఎంపిక చేసారు.
అధికార ప్రతినిధులుగా నియమించిన వారిలో కూనంపూడి శ్రీనివాస్ మినహా, మిగిలిన నలుగురు సభ్యులు గత అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ తరుపున పోటీ చేసారు. కొత్తగా నియమితులైన అధికార ప్రతినిధులు మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో పవన్ కళ్యాణ్ ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా వారికీ పార్టీ శ్రేణులంతా ఒకే మాటపై నిలబడాలని, భిన్నాభిప్రాయాలు రాకుండా చూసుకోవాలని పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేసారు.
[subscribe]
[youtube_video videoid=DUMs2nfudss]