ప్రపంచ మహిళా బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ లో స్వర్ణం పతకం గెలుచుకుని చరిత్ర సృష్టించిన తెలుగు తేజం పూసర్ల వెంకట (పీవీ) సింధుకు అభినందనలు, బహుమతులు వెల్లువెత్తుతున్నాయి. ప్రధాని మోడీ, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు, దేశవ్యాప్తంగా పలువురు సినీ ప్రముఖులు ఆమెను అభినందించారు. తాజాగా ఈ రోజు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు చాముండేశ్వరినాథ్ పీవీ సింధుకు బి.ఎం.డబ్ల్యూ కారును బహుకరించారు. అన్నపూర్ణ స్టూడియోలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగార్జున చేతుల మీదుగా కారు తాళాలను పీవీ సింధుకు అందజేశారు. ఈ కార్యక్రమానికి కోచ్ పుల్లెల గోపీచంద్ తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ, సింధుపై ప్రసంశలు కురిపించారు. ఆమెకు అభిమానిని అని, ఫైనల్ మ్యాచ్ లో అద్భుతమైన ఆట తీరుతో ప్రత్యర్థిని మట్టి కరిపించింది అని చెప్పారు. సింధుని చూసి గర్వపడుతున్నానని, భవిష్యత్ లో మరిన్ని విజయాలు సాధించాలని దేశం గర్వపడేలా చేయాలని కోరారు. చాముండేశ్వరినాథ్ ఇప్పటికి 22 కార్లను పలువురికి అందజేశారని, అందులో నాలుగు కార్లు సింధు దక్కించుకుందని చెప్పారు. అథ్లెట్స్ ను గుర్తించి వారికి గైడెన్స్ ఇచ్చి ప్రోత్సహించడంలో చాముండేశ్వరినాథ్ ముందుంటారని తెలిపారు. సింధు మాట్లాడుతూ నాగార్జున ఎవర్ గ్రీన్ హీరో అన్నారు. భవిష్యత్ లో బాడ్మింటన్ లో మరింత మెరుగ్గా రాణించేందుకు కృషి చేస్తానని చెప్పారు.
[subscribe]
[youtube_video videoid=bXuhFZnL6HU]