నేడు (సోమవారం) గుంటూరు జిల్లా తాడేపల్లి మండలంలోని ఇప్పటం గ్రామంలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభను నిర్వహించనున్నారు. జనసేన ఆవిర్భావ సభను భారీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పార్టీ కార్యకర్తలంతా పెద్ద ఎత్తున తరలివచ్చి సభను విజయవంతం చేయాలని నాయకులు కోరారు. జనసేనాని పవన్ కళ్యాణ్ కు సినిమా హీరోగా ఉన్న మాస్ ఫాలోయింగ్ తెలిసిన విషయమే. ఆయన అభిమానులు, పార్టీ అభిమానులు పెద్దఎత్తున తరలి వస్తారని పార్టీ అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో.. నేటి సభలో పవన్ కళ్యాణ్ ప్రసంగంపై సర్వత్రా ఆసక్తి వ్యక్తమవుతోంది. తొమ్మిదేళ్ల క్రితం ఆవిర్భవించిన జనసేన పార్టీ అనేక ఒడిదుడుకులు చవిచూసింది. 2014 సార్వత్రిక ఎన్నికలకు కొన్నిరోజుల ముందు పార్టీని ప్రకటించారు జనసేనాని. అయితే ఆ ఎన్నికలలో పోటీ చేయలేదు.
కానీ, టీడీపీ-బీజేపీ కూటమికి తన మద్దతును ప్రకటించింది. అనంతరం 2019 ఎన్నికల్లో వామపక్షాలు, బీఎస్పీతో కలిసి పోటీ చేసింది. అయితే, కేవలం ఒక్క సీటునే గెలుచుకోగలిగింది. పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్వయంగా రెండు స్థానాల్లో పోటీ చేసినా.. రెండింటిలో ఓడిపోవటం విశేషం. అయితే, ఆయన నిరుత్సాహపడకుండా అప్పటినుంచి పార్టీ నిర్మాణంపై దృష్టి సారించారు. అందుకే, ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉన్నా కూడా ఇప్పటినుంచే పార్టీని సమాయత్తం చేస్తున్నారు. నేటి మధ్యాహ్నం 3 గంటలకు ఆవిర్భావ సభ జరిగనున్న నేపథ్యంలో.. నాయకులు సభ ఏర్పాట్లను దగ్గరుండి పరిశీలిస్తున్నారు. నేటి సభలో పవన్ కళ్యాణ్ సోదరుడు, నటుడు నాగబాబు కూడా పాల్గొనబోతున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ