జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదివారం మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఇళ్ల కూల్చివేతకు గురైన ఇప్పటం గ్రామస్తులకు పార్టీ తరఫున ప్రకటించిన రూ.లక్ష చొప్పున చెక్కులు పంపిణీ చేశారు. మొత్తం 39 మందికి పవన్ కళ్యాణ్ ఆర్థిక సాయం చేశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, వైసీపీ నాయకులు ఇప్పటం గ్రామ ప్రజల గడపలు కూల్చారు. వైసీపీ గడపలు కూల్చే వరకు జనసేన పార్టీ నిద్రపోదని స్పష్టం చేశారు. ఇప్పటం గ్రామానికి తగిలిన దెబ్బ తన గుండెల మీద గాయం చేసిందని చెప్పారు. ఇప్పటం కూల్చివేతలు కచ్చితంగా క్షక్షపూరిత చర్యేనని తెలిపారు. జనసేన పార్టీ సభకు స్థలం ఇచ్చి అండగా నిలబడిన మీ కష్టంలో జనసేన పార్టీ కచ్చితంగా అండగా ఉంటుందని వారికీ పవన్ కళ్యాణ్ భరోసా ఇచ్చారు. మీకు చేదోడు వాదోడుగా ఉంటాం, భయపడవద్దని వారికీ ధైర్యం చెప్పారు. ప్రజల కన్నీళ్ల మీద కడుతున్న ఫ్యూడలిస్టిక్ కోటలు బద్దలు కొట్టి తీరుతామని, 2024 ఎన్నికలు మీకు గుర్తుండేలా చేస్తామని పవన్ కళ్యాణ్ సవాలు విసిరారు.
వైసీపీ నాయకులు 30 ఏళ్లు పాలించాలనుకుంటున్నారు, అయితే జనసేన రాష్ట్ర ప్రజలకు 30 ఏళ్ల భవిష్యత్తు ఇవ్వాలనుకుంటోందని అన్నారు. అలాగే జనసేన రౌడీ సేన అనే విమర్శలపై స్పందిస్తూ రౌడీ సేన కాదని, విప్లవ సేన అని అన్నారు. జనసేనకు అండగా నిలచిన గ్రామాల జోలికి వస్తే చూస్తూ ఊరుకోమని, 2024లో అంతకంత బదులిస్తామని చెప్పారు. రాష్ట్రంలో రాజకీయ ప్రమేయం, లంచాలు లేని వ్యవస్థలు స్థాపిస్తామని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. మరోవైపు ఆదివారం అన్నమయ్య ప్రాజెక్టు బాధితుల సమావేశంలో కూడా పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అన్నమయ్య ప్రాజెక్టుకు ముప్పును గ్రహించి అప్రమత్తం చేసి ఎంతో మందిని కాపాడిన రామయ్యను పవన్ కళ్యాణ్ సత్కరించి రూ.2 లక్షల ఆర్థిక సహాయం అందజేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE