ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వైఎస్సార్సీపీ కార్యకర్తలతో ముఖాముఖిలో భాగంగా విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గ కార్యకర్తలతో క్యాంపు కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. నియోజకవర్గంలో పార్టీ పరిస్థితిపై క్యాడర్తో సమీక్షించి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ఈసారి ఎన్నికల్లో మన లక్ష్యం 151 కాదు, 175 సీట్లు అని స్పష్టం చేశారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలలో ఇప్పటికే 95 శాతం పూర్తి చేశామని, అందుకే ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో ప్రజల నుంచి అద్భుత స్పందన వస్తోందని పేర్కొన్నారు.
‘రాజాం’ నియోజకవర్గంలో డీబీటీ కింద రూ.775 కోట్లు ఇచ్చామని.. గతంలో ఉన్న ప్రభుత్వ పాలనకు, ఈ ప్రభుత్వ పాలనకూ ఉన్న తేడాను ప్రజలకు చెప్పాలని సీఎం వివరించారు. అలాగే గత ఎన్నికల్లో ఇక్కడ వచ్చిన మెజార్టీ కన్నా ఈసారి మరింత పెరగాలని సూచించారు. ఇప్పటివరకూ రాజాం నియోజకవర్గంలో 12,403 ఇంటి స్థలాలు ఇచ్చామని, దాదాపు రూ.240 కోట్లు విలువైన ఇంటి పట్టాలు పంపిణీ చేశామని వెల్లడించారు. వీటిలో 9,509 ఇళ్లు నిర్మాణంలో ఉన్నాయని, దీని విలువ దాదాపు రూ.171 కోట్లు ఉంటుందని తెలిపారు. మన పార్టీలో దాదాపు 24 అనుబంధ విభాగాలు ఉన్నాయని, ఈ విభాగాలన్నింటికీ పార్టీపరంగా జిల్లా, మండలస్థాయి, గ్రామ స్థాయి వరకూ కమిటీలు ఏర్పాటు కావాలని సీఎం జగన్ ఆదేశించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY