మూడు రోజుల క్రిందట హైదరాబాద్ లో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో జూనియర్ ఎన్టీఆర్ భేటీ కావడం రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశం అవుతోంది. దీనిపై అన్ని ప్రధాన పార్టీలు స్పందిస్తున్నాయి. భేటీలో వారు ఏం మాట్లాడుకున్నారో అని సర్వత్రా ఆసక్తి వ్యక్తమవుతోంది. దీనిపై ఒక్కో పార్టీ ఒక్కో రకమైన వాదనను వినిపిస్తోంది. జూనియర్ త్వరలో రాజకీయాల్లోకి రావొచ్చనే ఊహాగానాలు కూడా కొందరు వినిపిస్తున్నారు. అయితే తాజాగా దీనిపై ఏపీ తెలుగు, సంస్కృతి అకాడమీ అధ్యక్షురాలు నందమూరి లక్ష్మీ పార్వతి కూడా స్పందించారు. బుధవారం తిరుపతిలో మీడియా సమావేశంలో ఆమె జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశంపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా లక్ష్మీ పార్వతి మాట్లాడుతూ.. జూనియర్ ఎన్టీఆర్ తప్పకుండా రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటున్న వారిలో తాను కూడా ఉన్నానని తెలిపారు. ఇక ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావడమే కాదని, తెలుగుదేశం పార్టీ (టీడీపీ)ని కూడా స్వాధీనం చేసుకోవాలని అభిలషించారు. అలాగే ఈ విషయంలో జూనియర్ ఎన్టీఆర్ కు తన ఆశీస్సులు ఉంటాయని ఆమె వెల్లడించారు. దీంతో జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశంపై లక్ష్మీ పార్వతి చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారాయి. అయితే ఇంతకూ ఎన్టీఆర్ నిజంగానే రాజకీయాల్లోకి వస్తాడా, రాడా అనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్సే. ఆయన స్వయంగా స్పందిస్తే తప్ప ఈ విషయంలో క్లారిటీ రాదు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY