ఇంగ్లాండ్ లోని బర్మింగ్ హామ్ వేదికగా ఇటీవల జరిగిన కామన్ వెల్త్ గేమ్స్-2022లో మహిళల 50 కిలోల బాక్సింగ్ విభాగంలో తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ స్వర్ణ పతకం సాధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోహైదరాబాద్ లోని నివాసంలో టీఆర్ఎస్ పార్టీ కీలక నేత, నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను బుధవారం నిఖత్ జరీన్ మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ సందర్భంగా నిఖత్ జరీన్ కు పుష్ఫగుచ్ఛం అందించి, కామన్ వెల్త్ గోల్డ్ మెడల్ ను వేసి, శాలువాతో సత్కరించి ఎమ్మెల్సీ కవిత అభినందనలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో నిఖత్ జరీన్ కుటుంబసభ్యులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన ప్రయాణంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, సీఎం కేసీఆర్, ఎమ్మెల్సీ కవిత అందించిన సహాయసహకారాలకు నిఖత్ జరీన్ కృతజ్ఞతలు తెలిపింది. అదేవిధంగా నిజామాబాద్ జిల్లాకు చెందిన నిఖత్ జరీన్ ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్ లో స్వర్ణం, కామన్ వెల్త్ గేమ్స్-2022లో స్వర్ణం గెలవడం గర్వకారణమని, ఆమె విజయాలు యువతకు స్ఫూర్తినిస్తాయని, మరిన్ని విజయాలను నిఖత్ జరీన్ సొంతం చేసుకోవాలని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY