కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ 5.0 కు సంబంధించి తాజాగా జారీ చేసిన ఆదేశాలలో అంతర్రాష్ట్ర రవాణాపై నిషేధం ఎత్తివేసింది. అయితే ప్రజా రవాణా, వ్యక్తుల అనుమతిపై ఇరు రాష్ట్రాలు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంతర్రాష్ట్ర కదలికలపై తదుపరిగా నిర్ణయం తీసుకొనేంత వరకు షరతులు కొనసాగుతాయని రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ వెల్లడించారు. ఇతర రాష్ట్రాల నుంచి రోడ్డు మార్గాన ఆంధ్రప్రదేశ్ రావాలనుకునే ప్రయాణీకులు ఖచ్చితంగా స్పందన పోర్టల్ ద్వారా ఈ పాస్ తీసుకోవాల్సిన అవసరం ఉందని, ఈ విషయాన్ని ప్రయాణీకులు గమనించాలని చెప్పారు.
అలాగే కరోనా ప్రభావం తక్కువగా ఉన్న రాష్ట్రాల నుంచి వచ్చే వారు హోమ్ క్వారంటైన్ లో ఉండాల్సిన అవసరం ఉంటుందని చెప్పారు. కరోనా ప్రభావం అధికంగా ఉన్న రాష్ట్రాల నుంచి వచ్చే వారు 7 రోజులు ఇన్స్టిట్యూషనల్ క్వారంటైన్ లో ఉండి కరోనా టెస్టులు చేయించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. టెస్టుల్లో పాజిటివ్ వస్తే కోవిడ్ హాస్పిటల్ కు, నెగటివ్ వస్తే మరో ఏడు రోజులు హోమ్ క్వారంటైన్ నిబంధన పాటించాల్సి ఉంటుందని చెప్పారు. ప్రభుత్వం నుంచి తదుపరి ఆదేశాలు వచ్చేవరకు అంతర్రాష్ట్ర సరిహద్దుల వద్ద ఇవే ఆంక్షలు కొనసాగుతాయని డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu