కోవిడ్ -19 (కరోనా వైరస్) కట్టడిలో భాగంగా విధించిన లాక్డౌన్ వలన రాజ్యసభ ఎన్నికల నిర్వహణ పక్రియ వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వాయిదా పడిన 18 రాజ్యసభ స్థానాలకు జూన్ 19న ఎన్నికలు నిర్వహించనున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం ఈ రోజు ప్రకటించింది. జూన్ 19 వ తేదీ ఉదయం 9 గంటల నుంచి 4 గంటల వరకు పోలింగ్ నిర్వహించి, అదే రోజున వెంటనే ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఏపీ, గుజరాత్ రాష్ట్రాల్లో నాలుగు స్థానాలకు, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో మూడు, జార్ఖండ్ లో రెండు, మేఘాలయ, మణిపూర్ రాష్ట్రాల్లో ఒక్కో స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి.
ముందుగా దేశంలోని పది రాష్ట్రాల్లో 37 రాజ్యసభ స్థానాలు ఏకగ్రీవం అవ్వగా, ఇక మిగిలిన 18 సీట్లకు ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ 18 సీట్లకు సంబంధించి నామినేషన్లు పరిశీలన కూడా పూర్తయింది. మార్చ్ 26 వ తేదీన పోలింగ్ జరగాల్సి ఉండగా, కరోనా వైరస్ వ్యాప్తి ప్రభావంతో ఎన్నికలను వాయిదా వేస్తున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu