పీఏసీ ఛైర్మన్‌ పయ్యావుల కేశవ్ ఆరోపణలు అర్ధరహితం : మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌

AP Finance Minister Buggana Rajendranath Reddy, AP FM blames CFMC for large-scale discrepancies, Buggana Rajendranath Issues Clarity on Payyavula Keshav, Buggana Rajendranath Press Meet, Buggana Rajendranath Reddy denies PAC chairman, Mango News, Minister Buggana Rajendranath Counter to PAC Chairman, Minister Buggana Rajendranath Press Meet, Minister Buggana Rajendranath Press Meet over PAC Chairman Payyavula Keshav Allegations, PAC Chairman Payyavula Keshav Allegations, Payyavula Keshav Allegations

పీఏసీ ఛైర్మన్‌ పయ్యావుల కేశవ్‌ చేస్తున్న ఆరోపణలు అర్ధరహితమని ఏపీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ అన్నారు. మంగళవారం నాడు ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, గత వారం రోజులుగా రాష్ట్రంలోని కొన్ని ఆర్థిక అంశాలపట్ల ప్రతిపక్ష పార్టీ, పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ అనవసర అనుమానాలు రేకెత్తిస్తున్నారన్నారని మండిపడ్డారు. 41 వేల కోట్లు అవకతవకలు జరిగితే దేశంలో వ్యవస్థ లేదా అని ప్రశ్నించారు. ఆడిట్‌ చేసినప్పుడు పలురకాల ప్రశ్నలు వేస్తారని, ఆడిట్‌ సంస్థ ప్రశ్నలను ఆధారంగా చేసుకుని విమర్శలు చేస్తున్నారని దుయ్యబట్టారు. సందేహాలు ఉన్నప్పుడు మీటింగ్‌ పెట్టి పరిష్కరించుకోవచ్చని, లేఖలు రాయటం వల్ల ప్రయోజనం ఏంటో అర్థం కావట్లేదన్నారు. బిల్లులు లేకుండా డబ్బులు చెల్లించారన్నది అవాస్తవమని తెలిపారు. రూ.41 వేల కోట్లకు పూర్తి లెక్కలు ఉన్నాయని, ప్రతిపక్షం నిజాలు తెలుసుకుని మాట్లాడాలని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ సూచించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × two =