దేశంలో రోజువారీ కరోనా కేసుల నమోదు తగ్గుముఖం పట్టింది. వరుసగా 16 రోజులుగా 50 వేల కంటే తక్కువుగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 32,906 కరోనా కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 3,09,07,282 కు చేరుకుంది. కరోనాకు చికిత్స పొందుతూ మరో 2020 మంది మరణించడంతో మరణాల సంఖ్య 4,10,784 కి పెరిగింది. ప్రస్తుతం 4,32,778 (1.40%) మంది కరోనా బాధితులు హోం ఐసోలేషన్ లలో, ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
కొత్తగా కేరళ (7,798), మహారాష్ట్ర (7,603), తమిళనాడు (2,652), అస్సాం (2,575), ఒడిశా (1,993), ఆంధ్రప్రదేశ్ (1,578), మధ్యప్రదేశ్ (1,481), కర్ణాటక (1,386), వెస్ట్ బెంగాల్ (885), తెలంగాణ (696) వంటి 10 రాష్ట్రాల్లోనే కరోనా కేసులు పెద్దసంఖ్యలో నమోదయ్యాయి. ఇక దేశంలో మరో 49,007 మంది బాధితులు కోలుకోవడంతో, రికవరీ అయిన వారి సంఖ్య 3,00,63,720 (97.27%) కు చేరుకుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ