టీడీపీ వ్యవస్థాపకుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) వర్ధంతి సందర్భంగా.. బుధవారం ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయన కుటుంబ సభ్యులు నివాళులర్పించారు. ఎమ్మెల్యే, నటుడు నందమూరి బాలకృష్ణ, రామకృష్ణ, సుహాసిని, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్రామ్ తదితరులు ఘనంగా నివాళులు అర్పించారు. వీరితో పాటు మాజీ సీఎం నారా చంద్రబాబు సతీమణి భువనేశ్వరి కూడా తన తండ్రికి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ.. ఎన్టీఆర్ కుమారుడిగా పుట్టడం పూర్వజన్మ సుకృతమని, టీడీపీ రూపంలో ఎన్టీఆర్ తమకు పెద్ద కుటుంబాన్ని ఇచ్చారని పేర్కొన్నారు. తెలుగు జాతి ఉన్నంత వరకు ఎన్టీఆర్ను మరిచిపోరని, తెలుగు ఖ్యాతిని ఆయన ప్రపంచానికి చాటిచెప్పారని, ఎన్టీఆర్ ఇచ్చిన స్ఫూర్తితో టీడీపీని ముందుకు తీసుకెళ్తామని తెలిపారు. ఇక అంతకుముందు ఈరోజు ఉదయమే జూ.ఎన్టీఆర్ మరియు కళ్యాణ్రామ్ సోదరులు ఎన్టీఆర్ ఘాట్కు చేరుకుని తమ తాత సమాధిపై పుష్ప గుచ్చాలు ఉంచి అంజలి ఘటించారు. ఈ క్రమంలో ఘాట్ వద్ద వారిరువురూ కొద్దిసేపు కూర్చొని ఎన్టీఆర్ను స్మరించుకున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE