మునుగోడు మండలం పలివెలలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. అధికార టీఆర్ఎస్ మరియు బీజేపీకి చెందిన కార్యకర్తలు పరస్పరం రాళ్లు, కర్రలతో దాడులు చేసుకున్నారు. ప్రచారానికి చివరిరోజైన మంగళవారం పలివెల గ్రామంలో ఇరు పార్టీలు ప్రచారం చేస్తున్న సమయంలో ఒక్కసారిగా ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే ఈ క్రమంలో అక్కడే ఉన్న బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కాన్వాయ్పై రాళ్ల దాడి జరిగింది. దీంతో ఆయన కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. అలాగే పలువురు బీజేపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. కాన్వాయ్లోని పలు ఇతర వాహనాలు సైతం దాడికి గురయ్యాయి. మరోవైపు బీజేపీ శ్రేణుల దాడిలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, నల్లగొండ జిల్లా పరిషత్ చైర్మన్ జగదీశ్ లకు గాయాలయ్యాయి.
అయితే ఈ ఘటనపై స్పందించిన ఈటల రాజేందర్ టీఆర్ఎస్ శ్రేణులు తమపై దాడి చేస్తుంటే పోలీసులు చోద్యం చూస్తూ నిలుచున్నారని, తన పీఆర్వో కాలికి గాయమయిందని మండిపడ్డారు. ఇక ఇరు వర్గాల ఘర్షణతో పలివెలలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ దాడి వెనుక అధికార పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు, ఇద్దరు జిల్లా పరిషత్ చైర్మన్లు ఉన్నారని, వారి అనుచరులతో వచ్చి మాఫీ దాడులు చేశారని ఆరోపించారు. తాము ప్రజాస్వామ్యయుతంగా ప్రచారం నిర్వహిస్తుంటే అధికార పార్టీ దాడులు చేస్తోందని, పోలీసులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని ఈటల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE