ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఇటీవల చోటుచేసుకున్న అనుచిత వ్యాఖ్యల వ్యవహారంపై పెద్దఎత్తున చర్చ జరిగిన విషయం తెలిసిందే. కాగా ఈ వ్యవహారంపై టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు సతీమణి, ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి తొలిసారిగా స్పందించారు. తనపై చేసిన అనుచిత వ్యాఖ్యలు పట్ల నిరసన తెలిపిన వారందరికీ వారికీ ఆమె ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు ఆమె ఓ ప్రకటన విడుదల చేశారు.
“ఆంధ్రప్రదేశ్ శాసనసభలో నాపై అనుచిత వ్యాఖ్యల పట్ల నిరసన వ్యక్తంచేసిన వారందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. నాకు జరిగిన అవమానాన్ని మీ తల్లికి/తోబుట్టువుకు/కూతురికి జరిగినట్టుగా భావించి నాకు అండగా నిలబడటం నా జీవితంలో మరిచిపోలేను. చిన్నతనం నుంచి అమ్మగారు, నాన్నగారు మమ్మల్ని విలువలతో పెంచారు. నేటికీ మేము వాటిని పాటిస్తున్నాము. విలువతో కూడిన సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషిచేయాలి. కష్టాల్లో/ఆపదలో ఉన్నవారికి అండగా నిలబడాలి. ఇతరుల వ్యక్తిత్వాన్ని కించపరిచేలా, గౌరవానికి భంగం కలిగించేలా ఎవరూ వ్యవహరించకూడదు. నాకు జరిగిన ఈ అవమానం మరెవరికీ జరగకుండా ఉండాలని ఆశిస్తున్నాను” అని నారా భువనేశ్వరి ప్రకటనలో పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ