తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో శుక్రవారం నాడు కడప జిల్లాలోని జమ్మలమడుగుకు చెందిన పలువురు కీలక నేతలు పార్టీలో చేరారు. మాజీ ఎమ్మెల్సీ నారాయణరెడ్డి, ఆయన కుమారుడు భూపేష్రెడ్డిలు పార్టీలో చేరగా, వారికీ చంద్రబాబు కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. మాజీ మంత్రి, బీజేపీ నేత ఆదినారాయణరెడ్డికి నారాయణరెడ్డి సోదరుడు. అలాగే ఈ సందర్భంగా భూపేష్రెడ్డికి జమ్మలమడుగు బాధ్యతలు అప్పగిస్తున్నట్టుగా చంద్రబాబు ప్రకటించారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ, జమ్మలమడుగు టీడీపీకి ఎప్పుడూ కంచుకోట అని చెప్పారు. పార్టీలో కష్టపడి పనిచేసే వారిని గుర్తించేలా మెకానిజం తయారుచేస్తున్నామని, కష్టపడి పని చేసే వారికీ భవిష్యత్ లో మంచి అవకాశాలు ఇస్తామని, ఎలాంటి అనుమానం అవసరం లేదని చెప్పారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ