21న నరసాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బహిరంగ సభ

Janasena Public Meeting, Janasena Public Meeting at Narasapuram, Mango News, Narasapuram, pawan kalyan, Pawan Kalyan open house in Narasapuram, Pawan Kalyan public meeting, Pawan Kalyan to Participate in Public Meeting, Pawan Kalyan to Participate in Public Meeting at Narasapuram, Pawan Kalyan to Participate in Public Meeting at Narasapuram on November 21st, Public Meeting at Narasapuram on November 21st

పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో నవంబర్ 21వ తేదీన జనసేన పార్టీ జిల్లా నాయకులు, జన సైనికులు భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారని, ఈ సభలో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పాల్గొని ప్రసంగిస్తారని జనసేన పార్టీ ప్రకటించింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. “పశ్చిమ గోదావరి జిల్లా పార్టీ నాయకులు, శ్రేణులు పవన్ కళ్యాణ్ పర్యటన, కార్యక్రమాల కోసం ఎదురు చూస్తున్నారు. 21వ తేదీ మధ్యాహ్నం 3గం.కు స్వర్ణాంధ్ర ఇంజినీరింగ్ కాలేజీ గ్రౌండ్స్ లో సభ మొదలవుతుంది. ఆ రోజే ప్రపంచ మత్స్య దినోత్సవం. పవన్ కళ్యాణ్ పలు వేదికలపై మత్స్యకారుల అభివృద్ధి గురించి కాంక్షించారు. పోరాట యాత్రకు గంగ పూజ చేసి శ్రీకారం చుట్టింది మత్స్యకారుల సమక్షంలో శ్రీకాకుళం జిల్లా కపాసుకుర్ది తీరంలోనే. నరసాపురంలోని బహిరంగ సమావేశం వేదిక నుంచి రాష్ట్రంలో మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యలు, వీరి జీవనోపాధికి విఘాతం కలిగించే వైసీపీ ప్రభుత్వ నిర్ణయాలను ప్రస్తావిస్తారు. పశ్చిమ గోదావరి జిల్లావ్యాప్తంగా నెలకొన్న పలు కీలక సమస్యలను జిల్లా నాయకులు ఇప్పటికే పార్టీ కేంద్ర కార్యాలయం దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ఆ సమస్యలను సైతం ప్రస్తావిస్తారు” అని ప్రకటనలో పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 − 6 =