ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసిన శ్రీ కొణిజేటి రోశయ్య గారు ఈ రోజు ఉదయం మరణించారు. సుదీర్ఘకాలం రాజకీయాలలో పనిచేసిన ఆయన మచ్చలేని నాయకుడిగా అందరిచేత గుర్తింపబడ్డారు. రాజకీయాలలో ఆయన చూడని పదవులు లేవు. విద్యార్థి నాయకుడిగా తన ప్రస్థానం ప్రారంభించిన ఆయన, ఆ తరువాత రాజకీయాలలో ప్రవేశించి ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా, ఆర్ధికమంత్రిగా, ముఖ్యమంత్రిగా, గవర్నర్ గా ఇలా ఎన్నో ఉన్నత పదవులు అలంకరించారు. దశాబ్దాల పాటు రాజకీయాలలో పనిచేసిన ఆయన ఎందరో ముఖ్యమంత్రుల వద్ద మంత్రిగా పనిచేసారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 16 సార్లు రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టి రికార్డు సృష్టించారు. అందులోను, వరుసగా 7 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టి ఎవరు అందుకోలేని మరో రికార్డు సృష్టించారు. ఎంత ఎత్తుకి ఎదిగినా కూడా ఆయన అందరితో సౌమ్యంగా, స్నేహపూర్వకంగా మెలిగేవారు. ప్రతిపక్ష పార్టీలు కూడా ఆయనని గౌరవించేవి. రాజకీయాలలో ఆయనని అందరు అజాత శత్రువుగా భావించేవారు. కాంగ్రెస్ అధిష్టానం కూడా ఆయనకు, ఆయన మాటకు ఎంతో ప్రాధాన్యతనిచ్చేది. సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన ఆయన అంచెలంచెలుగా అత్యున్నత స్థాయికి ఎదిగి తెలుగు రాజకీయాలలో తనదయిన ముద్ర వేశారు.
ఇటువంటి అరుదయిన గొప్ప నాయకుడిని మనం మళ్లీ చూడగలమా? ఈ క్రింది పోల్ లో పాల్గొని మీ అభిప్రాయాన్ని తెలియచేయగలరు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ