పార్లమెంట్ శీతాకాల సమావేశాలు డిసెంబర్ 7వ తేదీ నుంచి డిసెంబర్ 29వ తేదీ వరకు జరగనున్నాయి. కాగా రాజ్యసభ ఛైర్మన్గా ఉన్న ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్కర్ అధ్యక్షతన తొలిసారిగా రాజ్యసభ కార్యకలాపాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో రాజ్యసభ వైస్ ఛైర్మన్ కొత్త ప్యానల్ జాబితా విడుదల అయింది. మొత్తం ఎనిమిది మందితో కూడిన వైస్ ఛైర్మన్ల ప్యానెల్ ను ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్కర్ నియమించారు. కాగా వైఎస్సార్సీపీ పార్లమెంటరీ నేత, ఎంపీ వి.విజయసాయి రెడ్డి ఈ ప్యానెల్ లో కూడా మరోసారి చోటు దక్కించుకుని రాజ్యసభ వైస్ ఛైర్మన్ గా నియమితులయ్యారు.
తనను వైస్ ఛైర్మన్ల ప్యానెల్లో చేర్చినందుకు ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్కర్ కు విజయసాయి రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. మిగతా ప్యానెల్ సభ్యులందరికి అభినందనలు చెప్తూ, సభ పనితీరుకు పూర్తి సహకారం అందిస్తానని హామీ ఇస్తున్నానని విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు ఛైర్మన్ గా ఉన్న సమయంలో కూడా వైస్ ఛైర్మన్ల ప్యానెల్ లో విజయసాయి రెడ్డి ఉన్న విషయం తెలిసిందే. రాజ్యసభ వైస్ ఛైర్మన్ కొత్త ప్యానల్ లో విజయసాయి రెడ్డితో పాటుగా, భుబనేశ్వర్ కలిత, ఎల్.హనుమంతయ్య, తిరుచ్చి శివ, సుఖేందు శేఖర్ రాయ్, సస్మిత్ పాత్రా, సరోజ్ పాండే, సురేంద్ర సింగ్ నగర్ ఉన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE