రేషన్ కార్డుల జారీపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా కేవలం ఐదు రోజుల్లోనే దరఖాస్తులను పరిశీలించి అర్హతల ఆధారంగా రేషన్ కార్డులు అందజేయాలని నిర్ణయం తీసుకున్నారు. రేషన్ కార్డుల కోసం ఇకపై గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని, ఐదు రోజుల్లో అర్హతలను పరిశీలించి కార్డులు జారీచేస్తామని రాష్ట్ర పౌర సరఫరాల ఎక్స్అఫీషియో కార్యదర్శి కోన శశిధర్ బుధవారం నాడు వెల్లడించారు. జూన్ 6 వ తేదీ నుంచి కొత్త దరఖాస్తుదారులకు రేషన్కార్డులు అందజేస్తామని తెలిపారు. మరోవైపు రాష్ట్రంలో రేషన్ డోర్ డెలివరీలో భాగంగా రేషన్ కార్డుదారులకు బియ్యం సంచుల పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. ప్రతీ కుటుంబానికి 10,15 కిలోల చొప్పున సంచులను అందిస్తామని పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu