కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుంది. ఈ నేపథ్యంలో కరోనా పరీక్షల నిర్వహణలో ఆంధ్రప్రదేశ్ జూన్ 3, బుధవారం నాటికే 4 లక్షలకు పైగా కరోనా వైద్య పరీక్షలను నిర్వహించింది. ప్రతి మిలియన్ జనాభాకు 7,561 కరోనా వైద్య పరీక్షలు నిర్వహించి ఏపీ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది.
మరోవైపు జూన్ 4, గురువారం నాటికి రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 4112 కు చేరింది. మొత్తం కేసుల్లో రాష్ట్రంలో నమోదైనవి 3377 కాగా, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కూలీలు 616, విదేశాల నుంచి వచ్చిన వారు 119 మంది ఉన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 2,273 కు చేరగా, మరణాల సంఖ్య 71 కు చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 1033 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu