ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త కేబినెట్ కొలువుతీరిన విషయం తెలిసిందే. అందులో భాగంగా ప్రముఖ సినీ నటి, నగరి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజాకు పర్యాటకం, యువజన అభివృద్ధి, సాంస్కృతిక శాఖను కేటాయించారు. ఈ నేపథ్యంలో ఆర్కే రోజా బుధవారం ఉదయం సచివాలయంలో ఏపీ పర్యాటక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ముందుగా సచివాలయంలోని తన ఛాంబర్లో మంత్రి ఆర్కే రోజా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రోజా కుటుంబసభ్యులు, సంబంధిత శాఖలకు చెందిన అధికారులు హాజరై మంత్రి రోజాకి శుభాకాంక్షలు తెలియజేశారు.
2014, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరఫున నగరి నుంచి రోజా ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2019లో ఏపీలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏపీఐఐసీ చైర్మన్ గా కూడా రోజా బాధ్యతలు నిర్వర్తించారు. తాజాగా జరిగిన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా 25 మందితో కూడిన నూతన కేబినెట్ లో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రోజాకు అవకాశం కల్పించారు. దీంతో ఆమె తొలిసారిగా మంత్రి బాధ్యతలు చేపట్టారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ