ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప జిల్లా బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ దాసరి సుధ సోమవారం నాడు నామినేషన్ దాఖలు చేశారు. డాక్టర్ దాసరి సుధ నామినేషన్ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, మాజీ ఎమ్మెల్సీ గోవిందరెడ్డి, పలువురు నాయకులు పాల్గొన్నారు. మరోవైపు బద్వేలు అసెంబ్లీ ఉపఎన్నికకు అక్టోబర్ 1న నోటిఫికేషన్ విడుదల అయింది. అక్టోబర్ 1 నుంచి అక్టోబర్ 8వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. నామినేషన్ల పరిశీలన అక్టోబర్ 11న జరగనుండగా, నామినేషన్ల ఉపసంహరణకు అక్టోబర్ 13 ను ఆఖరుతేదీగా నిర్ణయించారు. ఇక అక్టోబర్ 30వ తేదీన పోలింగ్ నిర్వహించి, నవంబర్ 2వ తేదీన ఓట్ల లెక్కింపు పక్రియ చేపట్టనున్నట్టు ఎన్నికల సంఘం ప్రకటించింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ