శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో నిర్మిస్తున్న ‘సంగం’ బ్యారేజీకి దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి పేరు పెడతామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గత అసెంబ్లీ సమావేశాల్లో ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సంగం బ్యారేజీకీ దివంగత మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి పేరు పెడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏప్రిల్ 12, మంగళవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. సంగం బ్యారేజీకి ‘మేకపాటి గౌతమ్రెడ్డి సంగం బ్యారేజ్’ గా నామకరణం చేస్తునట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ముందుగా గత అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో మేకపాటి గౌతమ్రెడ్డి మృతిపై ఏపీ ప్రభుత్వం తరఫున సీఎం వైఎస్ జగన్ సంతాప తీర్మానం ప్రవేశపెట్టి, చర్చ సందర్భంగా మాట్లాడుతూ గౌతమ్రెడ్డి గౌరవార్థం నెల్లూరులోని సంగం బ్యారేజ్కు ఆయన పేరును పెడతామని తెలిపారు. సీఎం ప్రకటనకు అనుగుణంగా ఏపీ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీచేసింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ