తెలంగాణ రాష్ట్రం నుంచి నమస్తే తెలంగాణ దినపత్రిక ఎండీ దీవకొండ దామోదర్ రావు, హెటిరో అధిపతి డాక్టర్ పార్థసారథి రెడ్డి మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి న్యాయవాది నిరంజన్రెడ్డి, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ఇటీవలే రాజ్యసభ సభ్యులుగా ఎన్నికైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం టీఆర్ఎస్ నూతన ఎంపీలు దామోదర్ రావు, పార్థసారథి రెడ్డి మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూతన ఎంపీలు నిరంజన్రెడ్డి, ఆర్.కృష్ణయ్యలు రాజ్యసభ సభ్యులుగా ప్రమాణం చేశారు. రాజ్యసభలో చైర్మెన్ ఎం.వెంకయ్యనాయుడు సమక్షంలో వీరు నలుగురు వెంటవెంటనే ప్రమాణ స్వీకారం చేశారు. దామోదర్ రావు, పార్థసారథి రెడ్డి, ఆర్.కృష్ణయ్యలు తెలుగులో ప్రమాణ స్వీకారం చేయగా, నిరంజన్రెడ్డి ఇంగ్లీష్ లో ప్రమాణ స్వీకారం చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF