దేశంలో పలు రాష్ట్రాల్లో ప్రజాప్రతినిధులు కరోనా వైరస్ బారిన పడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆంధ్రప్రదేశ్ లోని విజయనగరం జిల్లా శృంగవరపు కోట నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీనివాసరావు కి కూడా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. జూన్ 10న ఆయన అమెరికా నుంచి వచ్చారు. గత రెండు రోజులుగా అనారోగ్యంతో బాధపడుతుండగా, అధికారులు ఆయనకు కరోనా పరీక్షలు నిర్వహించారు. ముందుగా ట్రూనాట్ పరీక్షల్లో ఆయనకు పాజిటివ్ గా తేలింది. అనంతరం ఆర్టీ-పీసీఆర్ పరీక్షల్లో కూడా పాజిటివ్గా తేలడంతో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. మరోవైపు ఇప్పటివరకు విజయనగరం జిల్లాలో 91 కరోనా కేసులు నమోదవగా, రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసులు సంఖ్య 9834 కు చేరింది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu