ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల (పీఏసీఎస్)ను బలోపేతం చేసేందుకు వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాల (ఆర్బీకే)తో అనుసంధానం చేస్తామని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ప్రకటించారు. విజయవాడలో డీసీసీబీ చైర్పర్సన్లు, సీఈవోలతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. దీని ద్వారా గ్రామ స్థాయిలో రైతులకు అందజేస్తున్న సేవలను మరింతగా పెంచాలని అధికారులకు సూచించారు. సీఎం జగన్ తీసుకున్న ప్రత్యేక చర్యల వల్లే ఆప్కాబ్తో సహా డీసీసీబీలన్నీ లాభాలు పొందుతున్నాయని చెప్పారు. వ్యవసాయ రుణాల పంపిణీలో రాష్ట్రంలో సహకార బ్యాంకులు 4వ స్థానంలో ఉన్నాయని, త్వరలోనే మొదటి స్థానంలో నిలవాలని ఆకాంక్షించారు.
రాష్ట్రంలోని 12.5 లక్షల మంది రైతులు ఆర్బీకేల నుంచి ఇప్పటివరకు 4.75 లక్షల టన్నుల ఎరువులు పొందారని తెలిపారు. రైతు భరోసా కేంద్రాల (ఆర్బీకే) ద్వారా రైతులకు విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు వంటి నాణ్యమైన ఇన్పుట్లను వ్యవసాయ శాఖ అందజేస్తోందని మంత్రి కాకాణి వెల్లడించారు. రైతుల అవసరాలన్నీ ఆయా గ్రామాల్లోనే తీర్చాలనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయానికి అనుగుణంగా ఆర్బీకేల కాన్సెప్ట్ను ప్రవేశపెట్టారని, ఇది తక్కువ కాలంలోనే వన్స్టాప్గా మారిందని అన్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభానికి ముందు ఆర్బీకేలలో 5.63 లక్షల టన్నుల ఎరువులు RBKలలో నిల్వ చేయబడిందని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి కాకాణి ఉద్యోగుల కోసం రూపొందించిన ‘కాబ్నెట్’ అనే మొబైల్ యాప్ను ఆవిష్కరించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ