టీడీపీ నాయకుడు, మాజీ మంత్రి, ప్రస్తుత టెక్కలి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడిని పోలీసులు కిడ్నాప్ చేశారని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ఈ మేరకు ట్విట్టర్లో ఆయన వరుస ట్వీట్స్ చేశారు. “తెలుగుదేశం శాసనసభ్యులు అచ్చెన్నాయుడు ఏమయ్యారు? నాతో సహా, వారి కుటుంబ సభ్యులెవరికీ ఆయన ఫోను అందుబాటులో లేదు. ఈ ప్రభుత్వం ఆయనను ఏం చేసింది? ఆయన్ను 100 మంది పోలీసులతో అక్రమంగా, చట్ట విరుద్ధంగా ఎందుకు కిడ్నాప్ చేయించారని” చంద్రబాబు ప్రశ్నించారు.
“అచ్చెన్నాయుడుని ఎక్కడకు తీసుకువెళ్ళారో తెలియదు, ఎందుకు తీసుకెళ్లారో తెలియదు, ముందస్తు నోటీసు ఇవ్వలేదు, బడుగు, బలహీనవర్గాలకు వైసీపీ ప్రభుత్వం చేస్తున్న మోసం, అన్యాయాలపై నిరంతరం పోరాడుతున్న అచ్చెన్నాయుడుపై జగన్ కక్షగట్టి ఇలా కిడ్నాప్ చేయించడం దారుణం. ఈ దుర్మార్గాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. దీనికి సీయం జగన్, హోంమంత్రి, డీజీపీ సమాధానం చెప్పాలి. ఈ దుర్మార్గానికి, ఉన్మాద చర్యలకు నిరసనగా బడుగుబహీనవర్గాల వారు, మేధావులు, ప్రజలు రాష్ట్రవ్యాప్తంగా జ్యోతిరావుఫూలే, అంబేద్కర్ విగ్రహాలకు వినతిపత్రాలు సమర్పించి తమ నిరసనను తెలియజేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నానని” చంద్రబాబు పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu