కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా తిరుపతి పర్యటన రద్దయ్యింది. ముందుగా మార్చి 4 వ తేదీన అమిత్ షా అధ్యక్షతన తిరుపతిలో సదరన్ జోనల్ కౌన్సిల్ 29 వ సమావేశం జరగనునట్టు తెలిపారు. ఈ సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశానికి ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల నుంచి ముఖ్యమంత్రులు హాజరు కావాల్సి ఉంది. అలాగే మార్చి 5 న తిరుపతిలో అమిత్ షా పర్యటనలో భాగంగా బీజేపీ-జనసేన మధ్య చర్చలు జరిగే అవకాశం ఉన్నట్టు తెలిపారు. ఈ నేపథ్యంలో అమిత్ షా తిరుపతి పర్యటన అకస్మాత్తుగా రద్దు అయింది. ఈ పర్యటన రద్దుకు గల కారణాలు ఇంకా వెల్లడించలేదు. మరోవైపు ముఖ్యమంత్రుల సమావేశం కూడా రద్దు అయినట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ సమావేశ నిర్వహణ తదుపరి తేదీని తర్వాత ప్రకటించనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ