తెలుగుదేశం పార్టీ (టీడీపీ) జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలందరికీ జాతీయ ఓటర్ల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. “ప్రజాస్వామ్య వ్యవస్థలో మన జీవితాలను అత్యంత ప్రభావితం చేసేది ఓటు. అటువంటి ఓటును కాపాడుకోవడం, సరైన విధంగా ప్రయోగించడం ప్రతి ఒక్కరి బాధ్యత. అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు పొందండి. ఎన్నికలను అపహాస్యం చేసేలా రాష్ట్రంలో వెలుగు చూస్తున్న దొంగ ఓట్ల వ్యవహారాలను అప్రమత్తతో ఎదుర్కోవాలి. ప్రజా వ్యతిరేక ప్రభుత్వాలకు అంతిమంగా బుద్ది చెప్పేది మన ఓటు మాత్రమే. చైతన్యవంతంగా ఉందాం. మెరుగైన సమాజం కోసం మన ఓటుతో తోడ్పదాం” అని చంద్రబాబు పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF