తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వైసీపీ ప్రభుత్వం, సిబిఐపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ ఎరకు ఆయన శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వం చేతకానితనం వల్లే రాష్ట్రంలో పదో తరగతి విద్యార్ధులు ఎక్కువ సంఖ్యలో ఫెయిల్ అయ్యారని పేర్కొన్నారు. ప్రభుత్వ తప్పిదం వలన అమాయక పిల్లలు బలవంతపు మరణాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. విద్యాశాఖ మంత్రి కానీ, అధికారులు కానీ, సీఎం జగన్ కానీ దీనిని సీరియస్ ఇష్యూగా తీసుకోవడంలేదని, పైగా వైసీపీ నేతలు బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
ఇంకా చంద్రబాబు మాట్లాడుతూ.. ఏపీలో టీడీపీ నాయకులపై, కార్యకర్తలపై దాడులు జరుగుతుంటూంటే పోలీసులు కనీసం చర్యలు చేపట్టడం లేదని, అధికార పార్టీకి కొమ్ము కాస్తున్నారని తీవ్ర విమర్శలు చేశారు. డీజీపీలు మారినా, వారి తీరు మాత్రం మారడం లేదని అసహనం వ్యక్తం చేశారు. ఇక మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసుకు సంబంధించి సీబీఐ త్వరగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఆలస్యం అయ్యేకొద్దీ కేసులో కీలకంగా ఉన్న నిందితులు తప్పించుకుంటారని, ఇప్పటికే సాక్షులుగా ఉన్న ఇద్దరు వ్యక్తులు మరణించారని గుర్తు చేశారు. సీబీఐ విశ్వసనీయతకే ఈ కేసు పెను సవాల్ అని, కరడుగట్టిన నేరస్తులను సీబీఐ వంటి సంస్థలు ఎంతమాత్రం ఉపేక్షించకూడదని అన్నారు. త్వరలోనే ఈ కేసులో నిందితులను అరెస్ట్ చేసి, ప్రజలకు నిజానిజాలు తెలపాలని కోరారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ