తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు మంగళవారం వికారాబాద్ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా వికారాబాద్ జిల్లా నూతన సమీకృత కలెక్టరేట్ సముదాయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. అనంతరం కలెక్టరేట్లో సీఎం కేసీఆర్ ప్రత్యేక పూజలు చేశారు. మొత్తం 34 ఎకరాల్లో రూ.60.70కోట్లు వ్యయంతో ఎన్నేపల్లిలో ఈ సమీకృత కలెక్టరేట్ సముదాయం నిర్మాణం జరిగింది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్, పైలట్ రోహిత్ రెడ్డి, కొప్పుల మహేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీలు పట్నం మహేందర్ రెడ్డి, సురభీ వాణీదేవి పలువురు స్థానిక నాయకులు, అధికారులు పాల్గొన్నారు.
ఈ పర్యటనలో ముందుగా వికారాబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పార్టీ జిల్లా కార్యాలయ నూతన భవనాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ పార్టీ ఆఫీసు ప్రాంగణంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పార్టీ ఆఫీసు లోపల సీఎం ప్రత్యేక పూజలు నిర్వహించారు. మరోవైపు జిల్లాలో మెడికల్ కాలేజీ నిర్మాణానికి కూడా సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. తొలిసారిగా వికారాబాద్ జిల్లా పర్యటనకు వచ్చిన సీఎం కేసీఆర్కు మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్థానిక సంస్థల ప్రతినిధులు ఘనంగా స్వాగతం పలికారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY