ఈ నెల 12నుంచి 14వరకు పల్నాడు జిల్లాలో పర్యటించనున్న టీడీపీ అధినేత చంద్రబాబు

TDP Chief Chandrababu Naidu will go For Three-Day Tour of Palnadu District From Oct 12 to 14, TDP Chief Chandrababu , Chandrababu Palnadu Tour, Palnadu Chandrababu Tour, Palnadu District Local Leaders , Mango News, Mango News Telugu, TDP Chief Chandrababu Naidu, Chandrababu Naidu Latest News And Updates, Chandrababu Naidu, TDP Chief Chandrababu Palnadu Tour, Telugu Desham Party, TDP News And Updates, Chandrababu Chittoor Tour LIve Updates

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు త్వరలో పల్నాడు జిల్లాలో పర్యటించనున్నారు. ఈ మేరకు షెడ్యూల్ ఖరారైంది. అక్టోబర్ 12, 13, 14 తేదీల్లో చంద్రబాబు నాయుడు జిల్లా పర్యటనకు రానున్నట్లు పల్నాడు జిల్లా పార్టీ నాయకులు తెలిపారు. ఇక పర్యటనలో భాగంగా చంద్రబాబు మినీ మహానాడు సహా పలు ఇతర కార్యక్రమాలలో పాల్గొంటారని వారు పేర్కొన్నారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా ఈ నెల 12న, తొలిరోజు పల్నాడు జిల్లా కేంద్రం నరసారావుపేటలో మహానాడు జరగనుంది. ఈ నేపథ్యంలో దీనికోసం టీడీపీ ఎమ్మెల్సీ మంతెన సత్యన్నారాయణ రాజు ఆధ్వర్యంలో పల్నాడు జిల్లా నేతలు ఈరోజు స్థల పరిశీలన చేశారు.

పట్టణ శివారులో మూడు స్థలాలను పరిశీలించిన వారు పార్టీ కేంద్రకార్యాలయానికి సమాచారం అందించారు. దీనిపై రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు ఒక స్థలాన్ని ఖరారు చేయనున్నారు. ఈ కార్యక్రమం అనంతరం అక్టోబర్ 13వ తేదీన చిలకలూరిపేటలో చంద్రబాబు నియోజకవర్గ నేతలతో సమీక్ష చేయనున్నారు. ఇక చివరిగా అక్టోబర్ 14వ తేదీన గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గంలో టీడీపీ చేపట్టనున్న రోడ్ షోలో పాల్గొననున్నారు. కాగా జిల్లా ఏర్పాటు తర్వాత చంద్రబాబు నాయుడు తొలిసారిగా పల్నాడులో పర్యటించనున్న నేపథ్యంలో దీనిని విజయవంతం చేయడానికి స్థానిక నేతలు పట్టుదలగా ఉన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen − 19 =