ఆంధ్రప్రదేశ్నుంచి హజ్ యాత్రకు వెళ్ళే పేద ముస్లింల కోసం సబ్సిడీని రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని డిమాండ్ చేశారు తెలుగుదేశం (టీడీపీ) పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. ఈ మేరకు ఆయన ఏపీ సీఎస్ జవహర్ రెడ్డికి లేఖ రాశారు. హజ్ యాత్రకు వెళ్ళే ముస్లింలపై అదనపు భారం తగదంటూ లేఖలో పేర్కొన్నారు. అయితే హైదరాబాద్ నుంచి హజ్కు వెళ్లే యాత్రికులకు అయ్యే ఖర్చుతో పోల్చితే విజయవాడ నుంచి వెళ్లే వారిపై ఒక్కొక్కరికి దాదాపు రూ.83,000 అదనపు భారం పడుతోందని తెలిపారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో హజ్ యాత్రకు రూ.2,40,000 వెళ్లే ఏర్పాటు చేశామని గుర్తు చేసిన లోకేష్.. ఆ తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చాక దానిని రూ.3,88,580 చేసిందని వెల్లడించారు.
అదే సమయంలో హైదరాబాద్ నుంచి హజ్ యాత్రకు వెళ్ళడానికి రూ.3,05,000 మాత్రమే ఖర్చు అవుతోందని నారా లోకేష్ తెలిపారు. ఈ లెక్కన ఏపీ నుంచి వెళ్లే ఒక్కో ప్రయాణికుడి మీద రూ.83,000 ఆదనపు భారం పడుతోందని, పేద ముస్లింలకు ఇది చాలా పెద్ద మొత్తం అని వివరించారు. అందుకే వారు హజ్ యాత్రకు వెళ్లేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వమే సబ్సిడీని భరించాలని లోకేష్ డిమాండ్ చేశారు. కాగా యువగళం పాదయాత్రలో భాగంగా.. పలుసార్లు లోకేష్ స్థానిక ముస్లిం వర్గాలతో భేటీ అవుతున్న నేపథ్యంలో.. కొంతమంది ఈ సమస్యను ఆయన దృష్టికి తెచ్చారు. ఈ క్రమంలోనే వారి సమస్యను ప్రధానంగా ప్రస్తావిస్తూ నారా లోకేష్ సీఎస్ జవహర్ రెడ్డికి లేఖ రాసినట్లు టీడీపీ వర్గాలు పేర్కొన్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE