తెలంగాణలో పదో తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులకు ఎలర్ట్. రేపు (బుధవారం, మే 9, 2023) మధ్యాహ్నం 12 గంటలకు ఈ పరీక్షల ఫలితాలు విడుదల కానున్నాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేయనున్నారు. కాగా ఏప్రిల్ 3వ తేదీ నుంచి 11వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలను నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మొత్తం 4,94,620 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో రెగ్యులర్ విద్యార్థులు 4,86,194 మంది దరఖాస్తు చేసుకోగా, 4,84,384 మంది ఎగ్జామ్స్ రాశారు. 1,809 మంది పరీక్షలకు హాజరు కాలేదు. అలాగే ప్రయివేటు విద్యార్థులు 443 మంది దరఖాస్తు చేసుకోగా, 191 మంది మాత్రమే హాజరయ్యారు. ఇక మంత్రి ఫలితాలను విడుదల చేసిన అనంతరం విద్యార్థులు అధికారిక వెబ్సైట్లలో చెక్ చేసుకోవచ్చని విద్యాశాఖ అధికారులు పేర్కొన్నారు. కాగా ఈరోజు ఇంటర్ ప్రథమ మరియు ద్వితీయ సంవత్సర పరీక్షల ఫలితాలను మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేసిన సంగతి తెలిసిందే.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE