ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి లేకుండా కేంద్ర హోంశాఖ భారతదేశ పొలిటికల్ మ్యాప్ ను విడుదల చేయడంపై గుంటూరు టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ లోక్ సభలో ప్రశ్నించారు. ఈ చర్య ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని, ప్రాంతాన్ని అవమానించడమే కాకుండా, దేశ ప్రధాని నరేంద్ర మోదీని కూడ అవమానించినట్టు అయిందని అన్నారు. జమ్మూ కశ్మీర్, లడఖ్ లు కేంద్ర పాలిత ప్రాంతాలుగా అమలులోకి వచ్చిన తరువాత కేంద్ర హోం శాఖ విడుదల చేసిన భారతదేశ మ్యాప్ లో ఏపీ రాజధాని అమరావతి లేకపోవడం ఆశ్చర్యానికి గురిచేసిందని చెప్పారు. అమరావతి నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోదీనే స్వయంగా హాజరై, శంకుస్థాపన చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గల్లా జయదేవ్ గుర్తుచేశారు. ఈ రోజు లోక్ సభలో జీరో అవర్ లో గల్లా ఈ అంశాన్ని లేవనెత్తారు. మ్యాప్ లో అమరావతి లేకపోతే, రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులపై ప్రభావం చూపే అవకాశం ఉందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా తప్పును సరిదిద్ది, అమరావతితో కూడిన కొత్త మ్యాప్ను విడుదల చేయాలని ఎంపీ గల్లా జయదేవ్ కోరారు.
[subscribe]