ఏపీలో కర్ఫ్యూ : సడలింపు సమయం సాయంత్రం 6 గంటల వరకు పెంపు

Andhra Pradesh government extends curfew, Andhra Pradesh Govt Extends COVID Curfew, Andhra Pradesh govt extends COVID-19 curfew, Andhra Pradesh govt extends curfew, AP Govt Announces Curfew Relaxations, AP govt extends COVID curfew, AP Govt Extends Curfew, Curfew Relaxations from June 21st, Govt Announces Curfew Relaxations, June 21st Relaxation Time Increases to 6 PM, latest updates, Mango News

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా మే 5 నుంచి కర్ఫ్యూ అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. కర్ఫ్యూ విధింపు గడువు జూన్ 20తో ముగియనున్న నేపథ్యంలో కర్ఫ్యూ సడలింపులలో మార్పులు చేస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నివారణ, కర్ఫ్యూ కొనసాగింపు, సడలింపులపై మంత్రులు, కోవిడ్ టాస్క్‌ఫోర్స్‌, ఇతర ఉన్నతాధికారులతో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం నాడు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్ష సందర్భంగా కర్ఫ్యూ సమయం సడలింపుపై సీఎం నిర్ణయం తీసుకున్నారు.

రాష్ట్రంలో కర్ఫ్యూ అమలులో భాగంగా జూన్ 11 నుంచి ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు దుకాణాలు తెరవడం సహా, ప్రజలు బయటకు వచ్చేందుకు అనుమతి ఇచ్చారు. అయితే ఆ సడలింపు సమయాన్ని జూన్ 21వ తేదీ నుంచి సాయంత్రం 6 గంటల వరకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. దుకాణాలను తెరిచేందుకు మాత్రం సాయంత్రం 5 గంటల వరకే అనుమతి ఇచ్చారు. ఇక ప్రతిరోజూ సాయంత్రం 6 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూను కఠినంగా అమలు చేయనున్నారు. కొత్త సడలింపు ఆంక్షలు జూన్ 21 నుంచి 30 వరకు అమలులో ఉండనున్నాయి. మరోవైపు కరోనా ప్రభావం అధికంగా ఉన్న తూర్పుగోదావరి జిల్లాలో ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకే సడలింపు యథాతథంగా కొనసాగుందని తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × five =