వైఎస్సార్సీపీ హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్పై తెలుగుదేశం పార్టీ ఎంపీలు లోక్సభ స్పీకర్కు ఫిర్యాదు చేశారు. అతనిపై తక్షణమే విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఈ సందర్భంగా ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు న్యూఢిల్లీలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. గోరంట్ల మాధవ్పై లోక్సభ స్పీకర్కు ఫిర్యాదు చేశామని, మా ఫిర్యాదుపై స్పీకర్ తప్పక చర్య తీసుకుంటారనే నమ్మకం ఉందని పేర్కొన్నారు. భవిష్యత్తులో మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని స్పీకర్ను కోరినట్లు తెలిపారు. మహిళలను కించపరిచేలా వ్యవహరించిన ఎంపీ మాధవ్పై వైఎస్సార్సీపీ ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని, ఆయనపై చర్యలు తీసుకోవడానికి ఎందుకు భయపడుతున్నారని కింజరాపు ప్రశ్నించారు.
గోరంట్ల మాధవ్ ఘటనను ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని, తొలుత ఎంపీ పైన చర్యలు తీసుకుంటామని ప్రకటించిన ఆయన ఆ తర్వాత మాట మార్చారని రామ్మోహన్ నాయుడు గుర్తు చేశారు. పార్లమెంట్ సభ్యుడుగా ఉన్న వ్యక్తి ఇలాంటి పనులు చేస్తే ప్రజలు ఏమనుకుంటారని, చట్టసభల గౌరవం కాపాడాలంటే గోరంట్ల మాధవ్పై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఆ వీడియో ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపడానికి ఎన్ని రోజులు పడుతుందని, ప్రస్తుతమున్న సాంకేతిక పరిజ్ఞానంతో ఆ వీడియో నిజమైనదా, కదా అని వెంటనే తేల్చేయవచ్చని ఎంపీ రామ్మోహన్ నాయుడు చెప్పారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY