వైసీపీలో చేరిన టీడీపీ సీనియర్‌ నాయకుడు, మాజీ మంత్రి శిద్ధా రాఘవరావు

AP CM YS Jagan, AP News, AP Political Updates, Sidda Raghava Rao Joined In YCP, Sidda Raghava Rao Joined In YCP In the Presence Of AP CM YS Jagan, TDP, TDP Senior Leader Joined In YCP, TDP Senior Leader Sidda Raghava Rao, TDP Senior Leader Sidda Raghava Rao Joined In YCP, YCP, YS Jagan

ప్రకాశం జిల్లాకి చెందిన టీడీపీ పార్టీ సీనియర్‌ నాయకుడు, మాజీమంత్రి శిద్ధా రాఘవరావు జూన్ 10, బుధవారం నాడు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. వైసీపీ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సమక్షంలో శిద్ధా రాఘవరావు, ఆయన కుమారుడు సుధీర్‌ పార్టీలో చేశారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ముందుగా తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో మంత్రి బాలినేని శ్రీనివాస్‌ రెడ్డితో కలిసి శిద్ధా రాఘవరావు సీఎంను కలుసుకుని చర్చించారు. ఈ చేరిక కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు ఆదిమూలపు సురేష్‌, వెల్లంపల్లి శ్రీనివాస్‌ కూడా పాల్గొన్నారు.

వైసీపీ లో చేరిన సందర్భంగా శిద్ధా రాఘవరావు మీడియాతో మాట్లాడుతూ, సీఎం వైఎస్ జగన్ సమక్షంలో పార్టీలో చేరాను. గత ఏడాది కాలంలోనే రాష్ట్రంలో సీఎం‌ ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. భవిష్యత్తులోనూ అనేక సంక్షేమ పథకాలను సీఎం అమలు చేయనున్నారు. ప్రజల్లో సీఎంగా వైఎస్ జగన్ చెరగని ముద్ర వేసుకోవాలని కోరుకుంటున్నానని శిద్ధా రాఘవరావు పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × 1 =