తెలుగు రాష్ట్రాలలో కోవిడ్-19(కరోనా వైరస్) రోజురోజుకి మరింతగా వ్యాప్తి చెందుతుంది. తెలంగాణ రాష్ట్రంలో ఏప్రిల్ 1, బుధవారం నాడు ఒక్కరోజే 30 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 127కు చేరింది. అలాగే బుధవారం కరోనా లక్షణాలతో గాంధీ ఆస్పత్రిలో ఇద్దరు, యశోద ఆస్పత్రిలో ఒకరు మృతి చెందడంతో రాష్ట్రంలో మృతి చెందిన వారి సంఖ్య కూడా తొమ్మిదికి చేరింది. మరణించిన ముగ్గురు కూడా ఢిల్లీలో మర్కజ్ సమావేశానికి వెళ్లి వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.
మరోవైపు ఏపీలో కూడా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి క్రమంగా పెరుగుతూ పోతుంది. బుధవారం రాత్రి 7 గంటల తర్వాత రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 111కి చేరినట్టు వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. అనంతరం రాత్రి 10:00 గంటల తరువాత నుంచి గురువారం ఉదయం వరకు విడుదలైన ల్యాబ్ ఫలితాలలో కొత్తగా 21 కేసులు పాజిటివ్ గా నమోదయ్యాయని పేర్కొన్నారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా వైరస్ కేసుల సంఖ్య 132 కి చేరింది. రాష్ట్రంలో 24 గంటల్లోనే 88 కొత్త కేసులు నమోదు కాగా, వీరిలో ఎక్కువ శాతం ఢిల్లీలో మర్కజ్ సమావేశానికి హాజరైన వారే ఉండడం విశేషం.
#CoronaUpdates: నిన్న (01/04/2020) రాత్రి 10:00 గంటల తరువాత నుంచి ఈ రోజు ఉదయం వరకు విడుదలైన ల్యాబ్ ఫలితాలలో కొత్తగా 21 కేసులు పాజిటివ్ గా నమోదయ్యాయి. వీటితో కలిపి రాష్ట్రంలో మొత్తం కొవిడ్-19 కేసుల సంఖ్య 132 కి చేరింది. @AndhraPradeshCM @MoHFW_INDIA #APFightsCorona #COVID19 pic.twitter.com/jAvNq6n0kU
— ArogyaAndhra (@ArogyaAndhra) April 2, 2020
01.04. 2020
Today positive cases: 30.
Dealths :3
(2 in Gandhi, 1 in yashoda)Toatal deaths till now :9.
— Eatala Rajender (@Eatala_Rajender) April 1, 2020