ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏప్రిల్ 1, బుధవారం నాడు సాయంత్రం 5 గంటలకు కరోనా వైరస్ నియంత్రణ కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, రాష్ట్రంలో తాజా పరిస్థితులపై ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. రాష్ట్రంలో గత రెండురోజుల నుంచి కరోనా పాజిటివ్ కేసులు పెరగడం బాధ కల్గించే అంశమని సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు.
సీఎం వైఎస్ జగన్ ప్రసంగంలో ముఖ్యాంశాలు:
- రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరగడం బాధాకరం.
- ఇటీవల ఢిల్లీ మర్కజ్ సమావేశానికి వెళ్లిన ప్రతి ఒక్కరినీ, వారితో సన్నిహితంగా ఉన్నవారినీ గుర్తిస్తున్నాం.
- వైరస్ వస్తే ఏదో జరిగిపోతుందని భావించొద్దు. కొన్ని కీలక జాగ్రత్తలు పాటిస్తే వైరస్ను అరికట్టవచ్చు.
- వయసు మళ్ళిన వారు, వృద్దులపై ఈ వైరస్ ప్రభావం కొంత తీవ్రంగా వుంది.
- వైరస్వచ్చిన వ్యక్తుల పట్ల వివక్ష, చిన్నచూపు, వ్యతిరేకభావం చూపొద్దని ప్రజలకు విజ్ఞప్తి.
- ఏపీలో మొత్తం నమోదైన కరోనా పాజిటివ్ కేసుల్లో 70 శాతం ఢిల్లీ మీటింగ్కు వెళ్లినవారే ఉన్నారు.
- ఏపీ నుంచి మొత్తం 1085 మంది ఢిల్లీ సమావేశానికి వెళ్లారు.
- ఇప్పటికే 585 మందికి వైద్య పరీక్షలు నిర్వహించగా, 70 మందికి పాజిటివ్ వచ్చింది. ఇంకా 500 మందికి సంబంధించిన నివేదికలు రావాల్సి వుంది.
- ఎవరైనా అనుమానితులుంటే ప్రజలు దగ్గరలో ఉన్న అధికారులు సమాచారమివ్వాలి.
- గ్రామ వాలంటీర్లు, ఆశావర్కర్లు, సచివాలయ సిబ్బందితో ప్రతి ఇంటి వద్ద సర్వే జరుగుతుంది.
- ప్రైవేట్ వైద్య కళశాలలు, ప్రైవేట్ ఆస్పత్రులు, నర్సింగ్ హోమ్ లు ఇలాంటి ప్రతికూల సమయంలో ప్రభుత్వానికి సహకరించాలి.
- కరోనా నివారణ చర్యల వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి భారం పడింది.
- కొంత వేతనాన్నీ వాయిదా వేసే అవకాశం ఇచ్చిన ప్రజా ప్రతినిధులు, ఐఏఎస్లు, ఐపీఎస్లు,పెన్షనర్లకు కృతజ్ఞతలు.
- రైతులు, రైతు కూలీలు మధ్యాహ్నం ఒంటి గంట వరకు మాత్రమే వ్యవసాయ పనులకు వెళ్లాల్సి ఉంటుంది.
- కరోనాపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.