ఏపీలో మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) కు మార్చి 10 న పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈసారి జీవీఎంసీ ఎన్నికలను అధికార వైఎస్సార్సీపీ, ప్రధాన ప్రతిపక్షం టీడీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుని ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు శుక్రవారం నాడు పెందుర్తి కూడలిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో భాగంగా జీవీఎంసీ టీడీపీ మేయర్ అభ్యర్థిగా పీలా శ్రీనివాసరావు పేరును చంద్రబాబు ప్రకటించారు. నీతి, నిజాయితీకి విశాఖ మారుపేరని చెప్పారు. హుద్ హుద్ వచ్చిన సమయంలో తిరిగి కోలుకుంటామా అనే సందర్భం నుంచి ఎంతో కష్టపడి పనిచేశామని అన్నారు. ఈ ఎన్నికల్లో టీడీపీకి అండగా నిలిచి గెలిపించాలని చంద్రబాబు ప్రజలను కోరారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ