జనసేన పార్టీ అధినేత, ప్రముఖ సినీనటుడు పవన్ కళ్యాణ్ తో సినీ నిర్మాతలు భేటీ అయ్యారు. శుక్రవారం ఉదయం పవన్ కళ్యాణ్ నివాసంలో ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, డీవీవీ దానయ్య, నవీన్ ఎర్నేని, వంశీ రెడ్డి, సునీల్ నారంగ్, బన్నీ వాసు ఆయన్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా చిత్రపరిశ్రమకు సంబంధించిన సమస్యల గురించి సృహృద్భావ వాతావరణంలో వీరి మధ్య చర్చలు జరిగినట్టు తెలిపారు.
ఇటీవల జరిగిన రిపబ్లిక్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదిక నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సినిమా పరిశ్రమ సమస్యలపై ఏపీ ప్రభుత్వంపై విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. అనంతరం బుధవారం నాడు పలువురు సినీ నిర్మాతలు మచిలీపట్నంలో ఏపీ రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని నానితో సమావేశమై సినిమా టికెట్ల విక్రయాల కోసం ప్రత్యేకంగా ఆన్లైన్ పోర్టల్ అంశం, ఇతర సినీ పరిశ్రమ సంబంధిత సమస్యలపై చర్చించారు. ఈ క్రమంలో తాజాగా సినీ నిర్మాతలు పవన్ కళ్యాణ్ తో కూడా భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ