తిరుమలలో మార్చి 1వ తేదీ నుంచి కొత్త రూల్ అమలులోకి రానుంది. తిరుమల శ్రీవారి సర్వదర్శనం, లడ్డూప్రసాదం, గదుల కేటాయింపు, రీఫండ్ చెల్లింపు తదితర అంశాల్లో మరింత పారదర్శకత పెంచేందుకు వీలుగా మార్చి 1వ తేదీ నుంచి ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ప్రయోగాత్మకంగా అమలు చేయనుంది. ఈ మేరకు టీటీడీ ఒక ప్రకటన విడుదల చేసింది. సర్వదర్శనం కాంప్లెక్స్ లో ఒకే వ్యక్తి అధిక లడ్డు టోకెన్లు పొందకుండా నివారించడానికి మరియు గదుల కేటాయింపు కేంద్రాలు వద్ద, కాషన్ డిపాజిట్ కౌంటర్ల వద్ద ఈ టెక్నాలజీని వినియోగించనున్నట్టు టీటీడీ తెలిపింది.
మరోవైపు 2023, ఫిబ్రవరి 20న మొత్తం 61,374 యాత్రికులు శ్రీవారిని దర్శనం చేసుకున్నారని తెలిపారు. 19,691 మంది తలనీలాలు సమర్పించారని, హుండీ కానుకలు రూ.4.20 కోట్లు వచ్చినట్టు తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE