ట్విట్టర్లో కేశినేని నాని vs బుద్ధా వెంకన్న

Twitter War Between Kesineni Nani And Buddha Venkanna,Andhra Pradesh Political News, Kesineni And Buddha engage in open war on Twitter, Mango News, TDP leaders hit out at each other on Twitter, TDP MP And MLC indulge in verbal war on Twitter, Kesineni Nani Buddha Venkanna Twitter War, War Of Words Between Kesineni Nani And Buddha Venkanna

ఇటీవల ఆంధ్రప్రదేశ్ ఎన్నికలో ఘోర పరాజయం తరువాత, టిడిపి నాయకులంతా తమ అభిప్రాయ వ్యక్తీకరణకు ట్విట్టర్, పేస్ బుక్ లాంటి సామాజిక మాధ్యమాలని వాడుకుంటున్నారు. అందులో ముఖ్యంగా విజయవాడ టిడిపి ఎంపీ కేశినేని నాని తన భావాల్ని సూటిగా వ్యక్తపరుస్తున్నారు, ఈ నేపథ్యంలో టిడిపి ఎమ్మెల్సీ బుద్దావెంకన్న కి, కేశినేని నానికి మధ్య ఆదివారం నాడు ట్విట్టర్ లో ఆసక్తికరమైన వాదన జరిగింది. విజయవాడ లో టిడిపి పార్టీలో కొంతకాలంగా వీరిద్దరి మధ్య ఆధిపత్య పోరాటం నడుస్తోంది. ‘ నాలుగు ఓట్లు సంపాదించలేని వాడు, నాలుగు పదవులు సంపాదిస్తున్నాడు. నాలుగు పదాలు చదవలేనివాడు, నాలుగు వాక్యాలు రాయలేనివాడు ట్వీట్లు చేస్తున్నాడు, ఇది దౌర్భాగ్యం, నిన్నటి దాకా చంద్రబాబు కాళ్ళు, రేపటి నుండి విజయసాయిరెడ్డి కాళ్ళు, కాళ్ళు కాళ్లే కానీ వ్యక్తులు మాత్రమే తేడా ‘ అంటూ కేశినేని నాని ట్విట్టర్లో పోస్ట్ చేసారు.

ఈ వాక్యలకు బుద్ధా వెంకన్న స్పందిస్తూ, ‘ సంక్షోభం సమయంలో పార్టీ కోసం,నాయకుడి కోసం పొరాడే వాడు కావాలి, ఇతర పార్టీ నాయకులతొ కలిసి కూల్చేవాడు ప్రమాదకరం, నీ లాగా అవకాశ వాదులు కాదు, చనిపోయే వరకు చంద్రబాబు కోసం సైనికుడిలా పొరాడేవాడు కావాలి, చిరంజీవి నీకు రాజకీయ జన్మనిస్తే చిరంజీవిని అనరాని మాటలని చిరంజీవి పార్టీని కూల్చావు, చంద్రబాబు నీకు రాజకీయ పునర్జన్మ ఇస్తే ఇవాళ చంద్రబాబు గురించి శల్యుడులా మాట్లాడుతున్నావు, విజయసాయి రెడ్డి మీద నేను పోరాడుతున్నానో నువ్వు పోరాడుతున్నావో ప్రజలకు తెలుసు, నీకు ఏం చేయాలో తెలియక అబద్ధాలు ఆడుతున్నావు, ప్రజారాజ్యం నుంచి బయటకి వచ్చే ముందు ఆడిన ఆటలు ఈ పార్టీలో సాగవునీకు ‘ అని బదులిచ్చారు. అంతే కాకుండా ‘ నువ్వు చేసినవన్నీ అభాంఢాలు, నేను చెప్పేవన్నీ నిజాలు, బస్సుల మీద ఫైనాన్స్ తీసుకొని 1997లో సొంతంగా దొంగ రిసిప్ట్ లు తయారుచేసుకుని ఫైనాన్స్ వారికి డబ్బులు చెల్లించకుండా నువ్వే దొంగ ముద్ర వేసుకొని కోట్లాది రూపాయలకు ఫైనాన్స్ కంపెనీలకు మోసం చేసిన నువ్వా ట్వీట్ చేసేది, దళిత నాయకుడు మాజీ స్పీకర్ బాలయోగి ఆస్తులన్నీ కాజేసిన దొంగ ఎవరో దేశం మొత్తానికి తెలుసు, ఒకే నంబర్ పై దొంగ పర్మిట్లతో బస్సులు నడిపిన దొంగవి నువ్వే కదా, నేను చెప్పాల్సిన నిజాలు చాలా ఉన్నాయి వినే ధైర్యం నీకుందా? ఉందా ‘ అంటూ ఘాటుగా స్పందించారు.

బుద్ధా వెంకన్న స్పందన తరువాత మళ్ళీ,ఈ రోజు కేశినేని నాని మరోసారి వివాదస్పద వాక్యాలు చేసారు. తనలాంటి వాడు పార్టీ కి అవసరం లేకుంటే, ఆ విషయాన్నీ చంద్రబాబు తనకు తెలియజేయాలని, పార్టీకి, ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని పేర్కొన్నారు, తనలాంటి వాళ్ళు పార్టీలో ఉండాలంటే తన పెంపుడు కుక్కను, చంద్రబాబు అదుపులో పెట్టుకోవాలని ట్వీట్ చేసారు. అసలే పార్టీ ఓడిపోయి, నిరాశలో ఉన్న కార్యకర్తలకి, నేతల మధ్య ఇలాంటి వాదనలు జరగడం ఆశ్ఛర్యం కలిగిస్తుంది. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఎలా స్పందిస్తారో అని  పార్టీ క్యాడర్ ఎదురుచూస్తున్నారు.


 

[subscribe]
[youtube_video videoid=C0J8GbKlcWc]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

8 − 5 =