ఏపీ సీఎం జగన్‌ను కలిసిన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రత్యేక సలహాదారు సాకేత్ మిశ్రా

Uttar Pradesh Chief Minister's Special Adviser Saket Mishra Meets AP CM YS Jagan at Camp Office,Uttar Pradesh Chief Minister,Special Adviser Saket Mishra,Meets AP CM YS Jagan,Meets Jagan at Camp Office,Mango News,Mango News Telugu,Tdp Chief Chandrababu Naidu,AP CM YS Jagan Mohan Reddy,YS Jagan News And Live Updates, YSR Congress Party, Andhra Pradesh News And Updates, AP Politics, Janasena Party, TDP Party, YSRCP, Political News And Latest Updates,AP BJP Party

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థను ఒక విప్లవాత్మక మార్పుగా అభివర్ణించారు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రత్యేక సలహాదారు (స్పెషల్ అడ్వైజర్) సాకేత్ మిశ్రా. మంగళవారం రాష్ట్రానికి వచ్చిన ఆయన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలుసుకున్నారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్‌ జగన్‌ను సాకేత్ మిశ్రా కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఏపీలో జరుగుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలు, అమలవుతున్న వివిధ సంక్షేమ పథకాలపై ఇరువురి మధ్య కొద్దిసేపు చర్చ జరిగింది.

అనంతరం మిశ్రా మాట్లాడుతూ.. ఏపీలో అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు వచ్చానని, ఇక్కడి సచివాలయ వ్యవస్థతో పరిపాలనలో విప్లవాత్మక మార్పులు తెచ్చారని, ఈ వ్యవస్థ దేశం లోని అన్ని రాష్ట్రాలకూ ఆదర్శమని పేర్కొన్నారు. అలాగే విద్య, వైద్యం మరియు వ్యవసాయ రంగాల్లో టెక్నాలజీ వినియోగించి అద్భుత ఫలితాలు రాబడుతున్నారని తెలిపారు. ఇక ఆర్బీకేల ద్వారా విత్తనాల నుంచి పంట విక్రయం ద్వారా అన్ని సేవలూ ఒకేచోట అందించడం గొప్ప విషయమని అన్నారు. కాగా మరోవైపు ఏపీ సీఐడీ నూతన డీజీగా నియమితులైన సీనియర్ ఐపీఎస్ అధికారి ఎన్ సంజయ్ కూడా ఈరోజు సీఎం జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

9 − 2 =